అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రైజ్) అభిమానుల్లో అంచనాల్ని పెంచుతున్నది. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిపిన భారీ షెడ్యూల్లో కీలక యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా యాక్షన్ టీజర్ను విడుదల చేయబోతున్నారని సమాచారం.
దేశవ్యాప్తంగా ‘పుష్ప’ చిత్రానికి లభించిన అపూర్వ ఆదరణ దృష్ట్యా సీక్వెల్పై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల అంచనాల్ని అందుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాయి.