టాలీవుడ్ లో ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ మళ్లీ ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సారి తరుణ్ యాక్టింగ్ కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని టాక్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప లో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఫహద్ ఫాసిల్ కు తరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప టీం తరుణ్ తో వాయిస్ ఓవర్ సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారట. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి చాలా కాలం తర్వాత తరుణ్ ఇలా ప్రేక్షకులను పలుకరించడం వెల్ కమ్ చెప్పాల్సిన విషయం.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!