ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలలో పుష్ప ఒకటి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలియజేశారు.
గతంలో పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం మరోసారి వాయిదా పడనుందని తెలుస్తుంది. డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న సోలోగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పుష్ప రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మరి పుష్ప రిలీజ్పై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్గా కనిపించనున్నాడు. రష్మిక శ్రీవల్లి అనే గూడెం అమ్మాయి గా నటించబోతోంది. పుష్పరాజ్ సతీమణిగా శ్రీవల్లి పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.