అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప-ది రైజ్` 2021 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాన్ ఇండియా సినిమా గా సన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ గా మాస్ లుక్ లో తన నటనను అదరగొట్టాడు. అల్లు అర్జున్ (Allu Arjun)కు 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో` పుష్ప-ది రైజ్ `లో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డు ను గెలుచుకున్నాడు అలాగే ఉత్తమ సంగీతం అవార్డ్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కి దక్కింది.
పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లుఅర్జున్ కూలి పని నుంచి సిండికేట్ నాయకుడిగా ఎదగడం ను చూపిస్తారు. ఈ చిత్రంలో రష్మికా, సునిల్, ఫాద్ ఫాజిల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప-దిరైజ్ సీక్వెల్ పుష్ప-ది రూల్ (Pushpa 2 The Rule) రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పుష్ప-2 కూడా అదే కాంబినేషన్ లో జరుగుతుంది. పుష్ప-2 మొదట ఆగష్టు-15 న విడుదల అవుతుందని చిత్ర బృందం వెల్లడించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పుష్ప-2 ఇంకా ముప్పై రోజుల షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. ప్రస్తుతం చిత్రీకరణ కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫాద్ ఫాసిల్ (Fahadh Faasil) డేట్స్ కోసమే పుష్ప-2 యూనిట్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. సో.. ఈ నెలాఖరులో పహద్ ఫాజిల్ డేట్స్ను బట్టి పుష్ప-2 చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బిజినెస్ను పుష్ప-2 పూర్తిచేసిందని అంటున్నాయి చిత్రవర్గాలు.
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Raj Tarun | 18లోపు విచారణకు రండి.. హీరో రాజ్తరుణ్కు నోటీసులు
Janhvi Kapoor | లెహంగాలో జాన్వీ పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్