అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. అల్లు అర్జున్తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్కు ముందు విశాఖపట్నం హార్బర్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సాధించడంతో ‘పుష్ప-2’ విషయంలో దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, యాక్షన్ ఎపిసోడ్స్ను వినూత్న పంథాలో డిజైన్ చేశారని అంటున్నారు.
రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అనసూయ భరద్వాజ్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.