న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన(CJP Protest) చేస్తున్న విషయం తెలిసిందే. అయతే ఇవాళ ఆ పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్లో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అంగీకరించింది. కేంద్ర మంత్రి నడ్డాతో .. సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు భేటీకానున్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రి నడ్డాను కలవనున్నారు. నిరసనకారులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
నిరసనకారులతో చర్చల చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ పేర్కొన్నారు. అయితే సీజేపీ నిరసనకారులు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రితో మాత్రమే తాము చర్చల్లో పాల్గొంటామని సీజేపీ చెప్పిది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న నేతలతో భేటీ అయ్యేందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. సౌరవ్ దాస్ దీని గురించి అధికారికంగా ప్రకటన చేశారు. మంత్రి జేపీ నడ్డాతో భేటీకానున్నట్లు దాస్ పేర్కొన్నారు.