పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. అక్కడ చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వైనాట్ శశికాంత్ ‘ది టెస్ట్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రికెట్ నేపథ్య కథాంశమిది. నయనతార ఓ కథానాయికగా నటిస్తున్నది.
ఈ సినిమాలో కథానుగుణంగా మరో నాయికకు చోటుందట. అందుకోసం రాశీఖన్నాను ఎంపిక చేశారు. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. క్రికెట్ నేపథ్య కథాంశంలో నటించడం చాలా ఆనందంగా ఉందని, తన కెరీర్లో ఇదొక విభిన్నమైన సినిమాగా నిలిచిపోతుందని రాశీఖన్నా పేర్కొంది. రాశీఖన్నా నటించిన ‘సర్ధార్’ చిత్రం ఇటీవలే తమిళనాట విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. హిందీ వెబ్సిరీస్ ‘ఫర్జీ’లో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలతో పాటు వెబ్సిరీస్లకు సమప్రాధాన్యం ఇస్తున్నదీ భామ.