puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణించిన తర్వాత కూడా ప్రేక్షకుల గుండెల్లో అలాగే బతికే ఉన్నాడు. ఆయన గురించి రోజు వస్తున్న వార్తలు చూస్తుంటే ఎంత గొప్ప వ్యక్తిని దేవుడు త్వరగా తీసుకెళ్లిపోయాడు అనేది అర్థమవుతుంది. కేవలం 46 ఏళ్ల వయసులోనే ఆయన ఒక లెజెండ్ అయిపోయాడు. తను చేసిన ఎన్నో మంచి పనులతో పునీత్ ప్రేక్షకుల దృష్టిలో నిజంగానే ఒక గొప్ప హీరోగా నిలిచిపోయాడు. తన మరణాన్ని ముందే ఊహించాడో లేదంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని ముందుగానే అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ.. తాను చేస్తున్న సేవలు ఎప్పటికీ అలాగే కొనసాగాలని 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు పునీత్ రాజ్కుమార్. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయనపై గౌరవం అందరికీ మరింత పెరిగింది.
తాను ఉన్నా లేకపోయినా ఎప్పుడూ తాను మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు అలాగే జరగాలని కోరుకున్నాడు పునీత్ రాజ్కుమార్. ఇంత గొప్ప వ్యక్తికి ఎలాంటి పురస్కారాలు ఇచ్చినా తక్కువే. ఆయన చనిపోయి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కర్ణాటకలో ఆ విషాద ఛాయలు అలాగే ఉన్నాయి. ఆయన సమాధిని దర్శించుకోవడానికి రోజుకు లక్షల్లో అభిమానులు అక్కడికి వస్తున్నారు. 16 మంది అభిమానులు ఆయనపై ప్రేమతో ప్రాణాలు వదిలారంటే పునీత్ స్థాయి మనకు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. ఇక ఇప్పుడు మరో అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం లభించింది.
కర్ణాటకలో అత్యున్నత సేవలు చేసిన వాళ్లకు బసవ శ్రీ పురస్కారం అందిస్తారు. ఇది కేవలం కన్నడిగులకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఆ అత్యుత్తమ పురస్కారం తమ రాజకుమారకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. కర్ణాటకలో అరుదుగా ఈ బసవ శ్రీ పురస్కారం లభించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్కుమార్ పెంపుడు కుక్కలు..
పునీత్ రాజ్కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?
Puneet Raj Kumar: చివరి క్షణాల్లోను యాక్టివ్గా కనిపించిన అప్పు.. వీడియో వైరల్
పునీత్ మరణ వార్త చదువుతూ.. లైవ్లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్
పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..