చిత్రసీమలో తెలివైన వారితో పాటు అబద్దాల ముసుగేసుకున్న ఫేక్ పీపుల్ చాలా మంది ఉంటారని చెప్పింది అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా. ప్రస్తుతం గ్లోబల్స్టార్గా చలామణి అవుతున్నదీ భామ. హిందీతో పాటు హాలీవుడ్లో రాణిస్తున్నది. అయితే కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నానని, రెండేళ్ల పాటు అవకాశాలు లేక మనోవ్యథకు గురయ్యానని చెప్పింది ప్రియాంక చోప్రా. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాటి అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నా వయసు 18 ఏళ్లు మాత్రమే. అంతగా పరిణితి లేకపోవడం వల్ల ఎవరిని నమ్మాలో తెలిసేది కాదు.
కథల ఎంపికపై ఏ మాత్రం అవగాహన లేదు. నేను అంగీకరించిన సినిమాలు మధ్యలోనే ఆగిపోయేవి. అలా ఏడాది పాటు అవకాశాల కోసం ఎక్కడకు వెళ్లినా తిరస్కారాల్ని చవిచూశాను. ఆ తర్వాత‘అందాజ్’ రూపంలో నా కెరీర్కు బ్రేక్ లభించింది. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు’ అని చెప్పింది. ఒకప్పుడు తనను రిజెక్ట్ చేసిన వారే అగ్ర నాయికగా ఎదిగిన తర్వాత డేట్స్ కోసం ఎదురుచూశారని, తిరస్కారం పొందిన చోటే గౌరవం అందుకోవడమే నిజమైన గెలుపని ప్రియాంకచోప్రా పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ హాలీవుడ్లో రూసో బ్రదర్స్ రూపొందిస్తున్న ‘సిటాడెల్’ సిరీస్లో నటిస్తున్నది. బాలీవుడ్లో ‘జీ లే జరా’ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది.