Priyanka Chopra | సినీరంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంటుంది. వారితో పోల్చితే కథానాయికల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. పారితోషికాల్లో ఈ వివక్ష గురించి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. అయితే గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా మాత్రం తాను కెరీర్లో తొలిసారి హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకున్నానని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్సిరీస్ త్వరలో అమెజాన్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ‘నా కెరీర్లో తొలిసారి హీరోతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నా. 22 ఏండ్ల సినీ ప్రయాణంలో ఇదొక అద్భుతమైన విషయంగా భావిస్తున్నా. బాలీవుడ్ చిత్రాల్లో కాస్త ఎక్కువ పారితోషికం అడగాలంటే భయపడేదాన్ని. కానీ ‘సిటాడెల్’ రెమ్యునరేషన్ విషయంలో కాస్త గట్టి ప్రయత్నాలే చేశా. నా సహ నటుడితో సమానమైన రెమ్యునరేషన్ కావాలని కోరా. ఏదో అద్భుతం జరిగినట్లు వారు వెంటనే అంగీకరించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నా’ అని చెప్పుకొచ్చింది.