Priyadarshi | ‘ఇందులో నా పేరు డా.వినయ్ గుమ్మాడి. పీహెచ్డీ చేయాలని ఫ్రెండ్స్తో కలిసి ఉస్మానియాలో చేరతాం. కానీ అసలు ఉద్దేశ్యం మాత్రం వేరు. అక్కడ వచ్చే స్టయిఫండ్, ఉచిత హాస్టల్ సౌకర్యం వీటికోసమే మా పీహెడ్డీ. నేను సైన్స్ని నమ్ముతాను. మిగతా ఇద్దరూ మంత్రాలు, తంత్రాలను నమ్ముతారు. ’ అని ప్రియదర్శి అన్నారు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. వి.సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మాతలు.
ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి చెబుతూ. ‘కథ నచ్చింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ అనగానే ఆసక్తి పెరిగింది. బలమైన నిర్మాణ సంస్థ. అన్నీ బావున్నాయి కాబట్టే ఇందులో భాగం అయ్యాను. ఇందులో మేం ముగ్గురం తింగరి పనులు చేసి సమస్యల్లో ఇరుక్కుంటాం. వాటి నుంచి ఎలా బయటపడ్డామనేది కథ. ఖర్చుకు నిర్మాతలు వెనుకాడలేదు. ఓ పాటకోసం పూనేకు 70కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థోర్’ అనే ప్యాలస్కు వెళ్లాం. సాంకేతికంగా నెక్స్ లెవల్ సినిమా ఇది. హీరోయిన్ల పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడిగా శ్రీహర్షాకు స్టార్స్టేటస్ను తెచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు ప్రియదర్శి.