రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నాలుగేళ్లుగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది సిమ్లా సుందరి ప్రీతి జింటా (Preity Zinta). ఈ బ్యూటీ నాలుగేళ్లుగా సిల్వర్ స్క్రీన్కు దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూఎస్లో ఉంటోంది ప్రీతి జింటా. ఈ భామ చాలా కాలం తర్వాత తన ఫాలోవర్లతో ఓ త్రోబ్యాక్ మూమెంట్ (Throwback Thursday)ను షేర్ చేసుకుంది. ఈ బ్యూటీ తొలిసారి 1998లో వచ్చిన దిల్ సే (Dil Se) సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన చిత్రం దిల్ సే. మణిరత్నం దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీలో నేపాల్ బ్యూటీ మనీషా కొయిరాలా మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. తొలి సినిమాను ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో షూట్ చేయగా..ఆ లొకేషన్లలో కేరళ కూడా ఒకటి. ఓ పాట షూటింగ్లో భాగంగా కేరళకుట్టిగా మారిపోయి ఏనుగుల మధ్య చిరునవ్వుతో దిగిన త్రోబ్యాక్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
‘నేనేం గుర్తించానో చూడండి..దిల్ సే కోసం కేరళలోని లొకేషన్లో ఈ సీన్ను చిత్రీకరించారు. నా మొదటి సినిమా షూటింగ్లో చాలా ఏనుగులు నన్ను చుట్టుముట్టినందుకు పులకించిపోయాను..’అంటూ మధుర క్షణాలను అందరితో పంచుకుంది. ప్రీతి జింటా తన కోస్టార్ షారుక్తో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్అవుతోంది.