మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేస్తోన్న ప్రగ్యాజైస్వాల్ వరుస అవకాశాలతో తిరిగి బిజీ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’లో కథానాయికగా నటిస్తోన్న ఆమె మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’లో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సొగసరి తెలుగులో మరో చక్కటి అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్-3’. డబ్బు వల్ల తలెత్తే సమస్యల్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇందులో ప్రగ్యాజైస్వాల్ ప్రత్యేకగీతంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇద్దరు కథానాయకులతో కలిసి ఆమె ఈ పాటలో నటించబోతున్నట్లు చెబుతున్నారు. మాస్ హంగులతో సాగే ఈ ప్రత్యేకగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని సమాచారం. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.