సత్యం రాజేష్, డా॥ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ముఖ్యపాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘పొలిమేర-2’. డా॥ అనిల్ కుమార్ దర్శకుడు. గౌరికృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్ను ఇటీవల కథానాయకుడు వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటీటీలో సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ కూడా ఆసక్తిగా వుంది.
ఈ సీక్వెల్ కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’ అన్నారు. నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ ‘ఫస్ట్పార్ట్ కన్నా రెండోపార్ట్ స్క్రీన్ప్లే పరంగా, కథా పరంగా మోస్ట్ ఇన్నోవేటివ్గా వుంటుంది. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కొనసాగే కథకు బ్లాక్ మ్యాజిక్ను జోడించి తెరకెక్కించిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు.