భారత ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా ‘విశ్వనేత’ పేరుతో బయోపిక్ రానుంది. అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
ప్రముఖ స్వరకర్త కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్నందిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, డీమానిటైజేషన్, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి అనేక అంశాలతో ఈ చిత్రాన్ని తెరెక్కించబోతున్నామని, ప్రధాని నరేంద్రమోదీ అసాధారణ జీవిత ప్రయాణానికి దృశ్యరూపంలా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.