బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చాలా కాలం తర్వాత పఠాన్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు. నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన పఠాన్ (Pathaan) జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది పఠాన్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ 14.5 మిలియన్ డాలర్లు (సమారు రూ.120 కోట్లు ) వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది.
ఈ కలెక్షన్లతో యూఎస్ఏలో ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ (14.3 మిలియన్ డాలర్లు ) తర్వాత అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది పఠాన్. బాహుబలి 2.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద 20.5 మిలియన్ డాలర్లతో లైఫ్ టైం కలెక్షన్లను నమోదు చేసి అత్యంత గ్రాస్ సాధించిన భారతీయ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. మరి రాబోయే రోజుల్లో పఠాన్ ఈ రికార్డును కూడా బీట్ చేస్తుందా.. ? అనేది చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఓ వైపు గ్లామరస్గా అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. జాన్ అబ్రహాం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కించింది.