Paresh Rawal | బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేశ్ రావల్కు కలకత్తా హైకోర్టు ఊరట లభించింది. ‘బెంగాలీలకు చేపలు వండండి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరేశ్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు సైతం చెప్పారు. ఈ విషయంపై మరోసారి ఫిబ్రవరి 6న విచారించనున్నది. గతేడాది గుజరాత్ ఎన్నికల సమయంలో పరేశ్ రావల్ బీజేపీ తరఫున రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం విమర్శలు వెల్లువెత్తాయి. నటుడు బెంగాలీలను అవమానించాడని పలువురు ఆరోపించారు.
విమర్శలు పెరగడంతో పరేశ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడిపై సైతం కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. పరేశ్ చివరిగా శర్మాజీ నమ్కీన్ చిత్రంలో కనిపించారు. రిషి కపూర్ ఆకస్మిక మరణంతో.. ఆయన స్థానంలో చిత్రంలో నటించారు. షెహజాదాలో కనిపించనున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పరేశ్ రావల్ ఇందులో కీలకపాత్ర కనిపించనున్నాడు. చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలోకి రానున్నది.