యోగేశ్వర్, అతిథి హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘పరారీ’. ఈ చిత్రాన్ని గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు. లవ్, కామెడీ, క్రైమ్ ఎంటర్టైనర్గా దర్శకుడు సాయి శివాజీ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నదని చెబుతున్నారు చిత్రబృందం. ఆదివారం హైదరాబాద్లో సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జీవీవీ గిరి మాట్లాడుతూ..‘అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా ఆకట్టుకుందనే ఫీడ్ బ్యాక్ వస్తున్నది. పాటలు, ఫైట్స్ బాగున్నాయని చెబుతున్నారు. సుమన్ పాత్ర కీలకంగా ఉండి ఆకట్టుకుంటున్నది. మా తొలి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.