రెండేళ్ల క్రితం తన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనందుకు మణిరత్నం పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కడవర్’ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఆఫర్ తిరస్కరించడానికి గల కారణాల్ని వివరించింది. ‘ఆ సినిమా కోసం చేసిన ఆడిషన్కు నేను హాజరయ్యాను.
మణి సర్ సినిమా కాబట్టి గొప్ప అవకాశంగా భావించా. కానీ ఆ తర్వాత ఆయన దగ్గరి నుంచి పిలుపురాలేదు. దాంతో చాలా బాధపడ్డాను. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు. ఆ సమయంలో నేను డిప్రెషన్లోనై తీవ్ర ఆందోళనలో ఉన్నందు వల్ల సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించా. ఒక్కోసారి మన దురదృష్టం కొద్ది అలాంటి మంచి అవకాశాలు మిస్సవుతుంటాయి’ అని చెప్పుకొచ్చింది.