LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna)ను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరోవైపు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
”ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడం అనేది నిస్సందేహంగా ఆయనకు తగిన గౌరవం. మన దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం అలాగే వచ్చిన అనంతరం దేశానికి అద్వానీ చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ వంటి దిగ్గజాలు రాజకీయాలు, రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు.” అంటూ చిరు రాసుకోచ్చారు.
‘Bharat Ratna’ is undoubtedly a greatly deserving honour to Shri LK Advani ji. He is one of the most distinguished statesmen our country has ever seen. His contribution to nation building since Pre Independence era and over several decades is invaluable. Stalwarts such as Advani…
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2024