‘నో లాజిక్..ఓన్లీ మ్యాజిక్’ అనే ట్యాగ్లైన్కు తగ్గట్లే ఈ సినిమా నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. థియేటర్ నుంచి హాయిగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు’ అని అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. శనివారం జరిగిన ‘ఓం భీమ్ బుష్’ సక్సెస్మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందనే నమ్మకంతో ఉన్నాం. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాలని నిర్ణయించుకున్నాం. సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేస్తున్నారు’ అన్నారు. ప్రేక్షకుల స్పందన చూసి సినిమా కోసం రెండేళ్లు పడ్డ కష్టాన్ని మర్చిపోయామని దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.