Sree Vishnu | సరికొత్త పాయింట్తో ‘ఓం భీం బుష్’ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకుల్ని వినోదంతో పాటు థ్రిల్కు గురిచేసే అంశాలెన్నో ఉంటాయని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయనతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పాత్రికేయులతో పంచుకున్న సంగతులు..
ముగ్గురు మిత్రుల కథ ఇది. సైంటిస్టులం కావాలని పీహెచ్డీ చేస్తుంటాం. అయితే మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించాలని భావించిన యాజమాన్యం అందుకు ఓ స్కెచ్ వేస్తుంది. భైరవపురం అనే ఊరికి మా ముగ్గురిని పంపిస్తారు. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? కింగ్స్లా బతికే ఫ్రెండ్స్ అక్కడ కూడా అలాగే కింగ్స్లా ఎలా మారారు? నిధిని అన్వేషించే వారి ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అయ్యాయనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ సినిమాకు తొలుత రెండు మూడు టైటిల్స్ అనుకున్నాం. క్యాచీగా ఉంటుందని ‘ఓం భీమ్ బుష్’ను ఓకే చేశాం. మనందరం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం కాబట్టి టైటిల్ అందరికి చేరువైంది. సినిమా టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. సినిమాను తొలుత ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేది టైటిలే కదా.
ఈ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. కథలో ఓ కొత్త పాయింట్ను చర్చించాం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ అది. ైక్లెమాక్స్లో ఆ ఐడియా రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు థ్రిల్గా ఫీలవుతారు. ఈ కథలో మిస్టరీ, థ్రిల్, ఫాంటసీ, కామెడీ..ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి.
నేను కలెక్షన్స్, మార్కెట్ లెక్కల గురించి అంతగా ఆలోచించను. నాతో సినిమా చేస్తున్న నిర్మాత నష్టపోకూడదనే విషయంపైనే దృష్టి పెడతాను. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా ఇప్పటికే మూడు నాలుగురెట్ల లాభం రావడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం నేను ‘శ్వాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ పూర్తయింది. ఓ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నా. గీతా ఆర్ట్స్లో ఓ సినిమా, కోన వెంకట్తో ఓ సినిమాకు అంగీకరించా.