Om Bheem Bush | టాలీవుడ్ యువ నటులు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్(No Logic Only Magic) అనేది ఈ సినిమా ఉపశీర్షిక. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు ‘హుషార్’ (Husharu) ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు ట్రైలర్ విడుదల చేయగా.. యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో రీతు వర్మ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రచ్చ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
#OmBheemBush – U/A – If the reports are to be believed, Sri Vishnu and the team coming up with a sure-shot entertainer. pic.twitter.com/W1kKkcftYO
— Aakashavaani (@TheAakashavaani) March 19, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గుప్త నిధులు కోసం సైంటిస్టులమని చెప్పి భైరవపురం అనే గ్రామంలో అడుగుపెట్టిన ముగ్గురు యువకుల కథ ఈ సినిమా. నిధిని కనిపెట్టడానికి భైరవపురంలో ఉన్న మహల్ లోకి ఎంట్రీ ఇస్తారు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. అయితే ఈ ముగ్గురు మహల్ లోకి వెళ్లిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి.? అసలు ఆ మహల్ లో ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.