సాయిరామ్శంకర్, అశీమా నర్వాల్, శృతీసోధీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘థ్రిల్లర్ కథాంశమిది.
సాయిరామ్శంకర్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. సముద్రఖని పోలీసాఫీసర్గా నటించారు. క్రైమ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. గోపీసుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: రాహుల్ రాజ్, నిర్మాతలు: వినోద్ విజయన్, గార్లపాటి రమేష్.