ఎన్టీఆర్ తాజా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ నిలిచిపోయిందని, దర్శకుడు ప్రశాంత్నీల్తో మేకర్స్కు సృజనాత్మక విభేదాలు తలెత్తాయని సోషల్మీడియాలో వస్తున్న రూమర్స్పై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ముందస్తు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతున్నదని, షూటింగ్కు ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది.
‘బయట ప్రచారమవుతున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదు. షెడ్యూల్స్ మధ్య కాస్త విరామం తీసుకోవడం సాధారణంగా జరిగేదే. దయచేసి ప్రేక్షకులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాం’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. ఈ ప్రకటనతో ‘డ్రాగన్’పై గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్కు చెక్పడ్డట్లయింది. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని సమాచారం. జూన్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, టోవినో థామస్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.