NTR | సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల “వార్ 2″తో వెండితెరపై సందడి చేసిన ఎన్టీఆర్, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కర్ణాటకలో జరుపుకున్న ఈ సినిమా, త్వరలో అమెరికాలో కీలక షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. హైదరాబాద్లోని US కాన్సులేట్కి ఎన్టీఆర్ ఇటీవల వెళ్లాడు. అమెరికా కాన్సుల్ జనరల్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఎన్టీఆర్తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
ఆ పోస్ట్లో ఎన్టీఆర్కు స్వాగతం పలుకుతూ .. “ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో తన రాబోయే ప్రాజెక్ట్స్ షూటింగ్ జరపనున్నారు. ఈ సందర్భంగా అమెరికా–ఇండియా భాగస్వామ్యం, ఉద్యోగావకాశాల సృష్టి, ద్వైపాక్షిక సంబంధాల బలపాటానికి ఇది దోహదం చేస్తుంది,” అంటూ రాసుకొచ్చారు. ఇక ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమా టైటిల్గా “డ్రాగన్” అనే పేరు వినిపిస్తోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్కు కేరాఫ్ అడ్రెస్గా మారిన దర్శకుడు. ఎన్టీఆర్ లాంటి పెర్ఫార్మర్తో ఆయన చేయబోయే సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
రుక్మిణి వసంత్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ఇది కాగా, అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం. రాజకీయ మరియు వాణిజ్య సంబంధాల పరంగా కూడా ఈ సినిమా ప్రభావం చూపనుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదలపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై సమాచారం రావొచ్చని తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ప్రాజెక్ట్ కావడంతో, అభిమానులు, పరిశ్రమ వర్గాలు రెండూ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎంత మాస్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి!
Every drop of sweat is building up for the destruction 💥💥
Man of Masses @tarak9999 pushing limits for the hysteria of #NTRNeel 🔥🔥#NTR pic.twitter.com/1Tr55smIj2
— Vamsi Kaka (@vamsikaka) September 16, 2025