NFT | సినిమా కథ ఎంపిక నుంచి విడుదల వరకు ప్రతీది కొత్తగా ఆలోచిస్తారు రామ్గోపాల్ వర్మ. ఈసారి తన ‘డేంజరస్’ మూవీని ఎన్ఎఫ్టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్) ద్వారా అమ్మకానికి పెట్టి ఓ కొత్త డిజిటల్ ప్రపంచం గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. యూనిట్ల వారీగా వర్మ సినిమాను కొన్నవారంతా ‘డేంజరస్’కు నిర్మాతలే. ఆ సినిమాను ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్లో విడుదల చేసినా, ఎవరైనా కొన్నా, అమ్మినా నిర్మాతలకు లాభాలే లాభాలు. ఇదంతా కొంచెం కొత్తగా ఉంది కదా!
‘just setting up my twttr’ ఇది ట్విటర్ సీయీవో జాక్ డోర్సే మొదటి ట్వీట్. దీనిని జాక్ ఎన్ఎఫ్టీలో విక్రయించారు. ఆ విలువ 1,630.58 ఈథర్ (క్రిప్టో కరెన్సీ). అమెరికాలో అయితే, 2.9 మిలియన్ డాలర్స్. మన దగ్గర దాదాపు 22 కోట్ల రూపాయలు. ఒక్క ట్వీట్కే అన్ని డబ్బులొస్తాయా? అంటే.. కచ్చితంగా వస్తాయి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రపంచంలో రారాజుగా ఉన్న ట్విటర్నుంచి వచ్చిన మొదటి ట్వీట్ అది. బాలీవుడ్ నుంచి ఎన్ఎఫ్టీలోకి మొదట ప్రవేశించిన ఘనత బిగ్బీ అమితాబ్దే. ఆయన ‘బియాండ్లైఫ్.క్లబ్’ నుంచి తన కలెక్షన్స్ను వేలం వేయడంతో మొదటి రోజే దాదాపు 3.8 కోట్ల రూపాయలు వచ్చాయి. శృంగార తార సన్నీలియోన్ ‘మిస్ఫిజీ’ పేరుతో ఎన్ఎఫ్టీ టోకెన్ తీసుకుంది. మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన ‘కురుప్’ చిత్రాన్ని ఎన్ఎఫ్టీలోనే విడుదల చేశారు. ఈ పద్ధతిలో విడుదలైన తొలి భారతీయ చిత్రం ఇదే. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన క్రికెట్ వీడియోలు, ఫొటోలు, ఇతర కలెక్షన్స్ను ఎన్ఎఫ్టీలో వేలం వేస్తున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమన్ కూడా తన ట్యూన్స్, పాటలు, మాటలు ..అన్నీ ఎన్ఎఫ్టీ వేదికగా వేలంలో పెట్టారు. బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత ఎన్క్రిప్టెడ్ సేవలు కావడంతో యజమానికి మాత్రమే మార్చడానికి, విక్రయించడానికి అధికారం ఉంటుంది. కొనుగోలు చేసినవారే దానికి యజమాని. వారికే సర్వాధికారాలు ఉంటాయి.
ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్. ఇది బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను పోలిన క్రిప్టో టోకెన్. బ్లాక్చైన్ ఆధారిత నాన్-ఫంజిబుల్ టోకెన్స్తో మీ కళను డిజిటల్ ఆస్తిగా మార్చి డబ్బు సంపాదించుకోవచ్చు. నాన్ ఫంజిబుల్ టోకెన్స్లో నమోదయ్యే ప్రతీ వస్తువును డిజిటల్ అసెట్స్గా మార్చవచ్చు. ఇందులో చిత్రాలు, పెయింటింగ్స్, ఆర్ట్స్కు మాత్రమే కాదు మీమ్స్, సాంగ్స్, ఫొటోస్, ట్వీట్స్, జిఫ్ ఇమేజీలు, మ్యూజిక్, వీడియోలతో పాటు వీడియో గేమ్స్లోని ఇన్-గేమ్ ఐటమ్స్ను కూడా డిజిటల్ ఆస్తులుగా మార్చుకోవచ్చు. ఈ ఎన్ఎఫ్టీలను ప్రధాన క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ ద్వారా విక్రయిస్తారు. వీటిని బ్లాక్చైన్ లావాదేవీ ద్వారా భద్రపరుస్తారు. అందుకే ఈ టోకెన్స్ క్రిప్టో ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
ఇదో పక్కా సాంకేతిక వ్యవహారం. ఎన్ఎఫ్టీలను నిర్వహించడానికి మొదట మీరు సంబంధిత వెబ్సైట్స్ (nftically, OpenSea, Rarible, Axie Marketplace)లో లాగిన్ అవ్వాలి. తర్వాత, ఆన్లైన్ క్రిప్టో వాలెట్ని సృష్టించాలి. క్రిపో ్ట- ఆస్తులు నిల్వ చేసిన వాలెట్ను ‘ప్రైవేట్ కీ’ సహాయంతో యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్రైవేట్ కీ సూపర్ – సెక్యూర్డ్ పాస్వర్డ్ లాగా పనిచేస్తుంది. ఇది లేకుండా ఎన్ఎఫ్టీ యజమాని టోకెన్లను యాక్సెస్ చేయలేరు. మీరు ఈ వాలెట్ను మెటామాస్క్, బైనాన్స్ వంటి బ్లాక్చైన్ ఆధారిత సేవలకు లింక్ చేయాలి. తర్వాత మీ డిజిటల్ ఆస్తిని ఎన్ఎఫ్టీగా మార్చి అమ్ముకోవాలంటే వేలం వేయాలి. దానికి విలువను నిర్ణయించేది కూడా మీరే. ఆ వస్తువు నుంచి రాయల్టీ కూడా పొందవచ్చు. ఈ ప్రక్రియ అంతా క్రిప్టో కరెన్సీలోనే నిర్వహించాలి. రాయల్టీ నోట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ వస్తువు అమ్ముడవుతున్న కొద్దీ రాయల్టీ కింద మీకు లాభాలు వస్తూనే ఉంటాయి. వచ్చిన క్రిప్టో కరెన్సీని సురక్షితమైన ఎక్సేంజ్ల ద్వారా రూపాయల్లోకి మార్చుకోవచ్చు. కాకపోతే, నిపుణుల సలహా తీసుకోవాలి. లేకపోతే చేతులు కాలడం ఖాయం! చాలా సందర్భాల్లో జరుగుతున్నది ఇదే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..