DIl Raju | తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయించారని తెలిసిందే. రెంటల్ బేసిస్లో (అద్దె ప్రాతిపదిక) సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై దిల్ రాజు స్పందించారు.
థియేటర్ల మూసివేత వద్దని 24న మీటింగ్ పెట్టాం. కానీ ఈ లోపు విషయం డైవర్ట్ అయిపోయింది. పవన్ కల్యాన్ సినిమాపైకి విషయం వెళ్లిందన్నారు దిల్ రాజు. హరిహర వీరమల్లు సినిమాలో మేలో విడుదలవుతుందని చెప్పారు. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడ్డదని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు. సినిమా విడుదల, టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలకు పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు తెలిపారు. ఎవరికి వారే వారి సినిమాలను గురించి అడుగుతున్నారు. ఫిలిం ఛాంబర్లోనే యూనిటీ లేదు. పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేశామనడం తప్పన్నారు.
తొలిరోజే గేమ్ చేంజర్ పైరసీ..
గేమ్ చేంజర్ మూవీ తొలిరోజే పైరసీ వచ్చింది. ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు దిల్ రాజు . తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే నాకు 30 థియేటర్లున్నాయి. పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారు. ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ గురించి ఆరా తీశాం. రెంట్, పర్సెంటేజ్ పద్దతిలో ఆడే సినిమాలపైనే వివాదం నెలకొందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు భేటీ అయ్యారు. ఎగ్జిబిటర్ల మీటింగ్తో అసలు టాపిక్ మొదలైందన్నారు. ఇది ఆ జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల విషయం మాత్రమే. సినిమాలకు మొదటి వారం రెంట్ ఇస్తాం. రెండో వారం నుంచి పర్సెంటేజ్ ఇస్తున్నాం. నష్టమెందుకు వస్తుందో ఆరాతీశామన్నారు.
ప్రస్తుతం అత్యధిక సినిమాలు పర్సెంటేజ్ విధానంపైనే ఆడుతున్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలోనే ఆడిస్తున్నారు. అలాంటి ఎగ్జిబిటర్లే తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం పెట్టారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లను డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదు. తమ పర్సెంటేజ్ విధానం అమలు చేయకపోతే థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు అన్నారు. మాకు పర్సెంటేజీ విధానం కావాలని ఆ సమావేశంలో ఎగ్జిబిటర్లు చెప్పారని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
కాగా కొన్ని రోజులుగా రెంటల్ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా.. మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది.