సుకుమార్ (Sukumar)-అల్లు అర్జున్ (alluarjun) కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప..ది రూల్ (Pushpa The Rule) అప్డేట్ ఇప్పటికి వచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ ట్యూనే జాన్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ , సుకుమార్ టీం కలిసి పుష్ప..ది రూల్ కోసం అల్లు అర్జున్ పై ఫొటోషూట్ సెషన్ కూడా నిర్వహించారు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సీక్వెల్లో బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం జిషు సేన్ గుప్తా సీక్వెల్లో నటించడం లేదట. భీష్మ, శ్యామ్ సింగరాయ్ లో మెరిసిన ఈ బెంగాలీ నటుడిని పుష్ప.. ది రూల్ లో కీలక పాత్ర కోసం ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని ఇన్ సైడ్ టాక్.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సూపర్ హిట్ ఆల్బమ్ను రెడీ చేసినట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చాయి. పుష్ప 2లో కూడా రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుండగా..సునీల్ ఫహద్ ఫాసిల్, అనసూయ సీక్వెల్లో కూడా కనిపించనున్నారు. కొత్తగా చేరే యాక్టర్లు ఎవరైనా ఉన్నారా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్ల్యాండ్ లెటర్తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్