టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నితిన్ (Nithiin) ఫుల్ స్పీడు మీదున్నాడు..ఇప్పటికే మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. డైరెక్టర్ వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ నూతన చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ నేడు గ్రాండ్గా లాంఛ్ అయింది. హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షురూ అయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పీ రామ్మోహన్రావు క్లాప్ కొట్టగా..ఆదిత్యా మ్యూజిక్ ఉమేశ్ గుప్తా కెమెరా స్విఛాన్ చేశారు.
#Nithiin32 Launched today on an auspicious note with a formal pooja ceremony🪔
Starring Youth🌟@actor_nithiin & @sreeleela14♥️
🎬@VamsiVakkantham
🎶@Jharrisjayaraj
🎥 #SaiSrinivas
🖌@sahisuresh#SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMoviesShoot commences soon🤘 pic.twitter.com/jQgQtz362S
— Sreshth Movies (@SreshthMovies) April 3, 2022
డైరెక్టర్ సురేందర్ రెడ్డి తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, ఠాగూర్ మధు స్క్రిప్ట్ను డైరెక్టర్ వక్కంతం వంశీకి అందజేశారు. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy)దర్శకత్వం వహిస్తున్న మాచెర్ల నియోజకవర్గం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం జులై 08న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది.