సెలబ్రిటీల్లో ఎక్కువమంది ఎంపిక చేసుకునే టూరిజం స్పాట్ ఏదైనా ఉందంటే..ఠక్కున గుర్తొచ్చే ప్రదేశం మాల్దీవులు. ఈ ప్రపంచప్రఖ్యాత పర్యాటక క్షేత్రం నిత్యం సినీ హీరోహీరోయిన్లు, వారి కుటుంబసభ్యులతో కలకలలాడిపోతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ మాల్దీవుల్లో సందడి చేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌటు. సైఫ్ అలీఖాన్ సతీమణి కరీనాకపూర్ ఖాన్ (Kareena Kapoor), ఆమె సోదరి కరీష్మా కపూర్ (Karisma Kapoor)తోపాటు ప్రముఖ బిజిమెన్ వుమెన్ నటాషా పూనావల్లా (Natasha Poonawalla) మాల్దీవుల్లో చక్కర్లు కొట్టారు.
కరీనా యెల్లో మోనికిలీ బికినీ షూట్లో, కరీష్మా బ్లాక్ బికినీ, నటాషా డియోర్ బికినీ గెటప్స్లో సాగరంలో మునిగితేలుతూ కెమెరాలకు స్టన్నింగ్ ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. కరీనా, కరీష్మా గత వీకెండ్లో తమ పిల్లలతో కలిసి ముంబై ప్రైవేట్ ఎయిర్ పోర్టు నుంచి మాల్దీవులకు వెళ్లింది. కరీనాకపూర్ ఇటీవలే డిజిటల్ డెబ్యూ ప్రాజెక్టును ప్రకటించింది.
జపనీస్ నవల The Devotion Of Suspect X ఆధారంగా రాబోతున్న థ్రిల్లర్ ఫిల్మ్లో నటించనుంది. జైదీప్ అహ్లావట్, విజయ్ వర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సముద్రానికి సమీపంలో సంతోషకర సమయం. మై గాళ్స్, వారి పిల్లలతో క్విక్ ట్రిప్..మంచి ఆహారం, వాటితోపాటు మంచి ఫోజులు, ఛాటింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.