Ranbir Kapoor | నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’లో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నారు. ఈ ఇతిహాసం 2025 ద్వితీయార్థంలో విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని ఈ నెలలో లేదా మార్చిలో కచ్చితంగా పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రామాయణం మొత్తం ప్రపంచాన్ని నితేశ్ తివారీ ఇప్పటికే నిర్మించినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాతో ఫిల్మ్ మేకింగ్కు సంబంధించి కొత్త సాంకేతికతను పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ రన్ను ఇప్పటికే అనేక సార్లు నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కిం చబోతున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినప్పుడు యష్ వెంటనే ఒప్పుకోలేదు. అభిమానులు తనను రావణ పాత్రలో చూడగలుగుతారా..? అన్న సందిగ్ధంలోనే కొన్నిరోజులు ఉండిపోయారు. వారి నుంచి స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమైన తర్వాతే ఈ క్యారెక్టర్ను ఓకే చేశారు. యష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ ప్రధాన భాగంలో నిమగ్నమయ్యారు. ఇది పూర్తిచేసిన తర్వాత జూలై నెలలో ‘రామాయణ’ బృందంలో చేరనున్నారు.