జగిత్యాల : పట్టణంలోని అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి లక్ష్మీ నారాయణ ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా నష్టపోయాడు. బాధితుడు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ను కలువగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఈ మేరకు రెండు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారుని ఇంటివద్దకు వెళ్లి ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి చెక్ అందజేయడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బోగ ప్రవీణ్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.