Rashmika Mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఛలో, గీతాగోవిందం, భీష్మ, సరిలేరు వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది. ఇక గతేడాది విడుదలైన పుష్ఫతో పాన్ ఇండియా స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె క్రేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమెను సోషల్ మీడియాలో నెటీజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అసలు విషయమేంటంటే.. లేటెస్ట్గా ఈ కన్నడ సోయగం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్డే పార్టీకి హాజరైంది. సౌత్ నుంచి ఆహ్వనం అందుకున్న అతికొద్ది మంది సెలబ్రిటీల్లో రష్మిక ఒకరు. గత రాత్రి జరిగిన ఈ పార్టీలో రష్మిక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అయితే ఈ డ్రెస్లో ఈమె థైస్ బయటకు కనిపించేలా ఉన్నాయి. దాంతో ఈమె కెమెరాకి ఫోజులివ్వడంలో ఇబ్బంది పడింది. చేతులు అడ్డుపెట్టి ఫోటోలు తీయ్యోద్దూ అన్నట్టుగా సైగ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటీజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. అంత ఇబ్బందిగా అనిపించినప్పుడు అలాంటి డ్రెస్సెస్ ఎందుకు వేసుకోవడం అంటూ నెటీజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పార్టీకి విజయ్ దేవరకొండ, ఛార్మీ, పూరీలు కూడా హజరయ్యారు.
సినిమాల విషయానికొస్తే రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. అందులో మూడు చిత్రాలు షూటింగ్లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ‘మిషన్ మజ్ను’ తో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. దీనితోపాటుగా ‘గుడ్బాయ్’ అనే మరో బాలీవుడ్ సినిమాలో అమితాబ్తో కలిసి నటించింది. కోలీవుడ్ స్టార్ విజయ్తో తెలుగు, తమిళ ద్విభాష చిత్రంలో నటిస్తుంది. వీటితో పాటుగా దుల్కర్ ‘సీతారామం’లో కీలకపాత్రను పోషిస్తుంది. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ చిత్ర షూటింగ్లోనూ అడుగు పెట్టింది. ఈమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ఫ ది రూల్’ త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుంది.