బాలీవుడ్ హీరోయిన్ నేహాదూపియా, తన కొడుకుతో కలిసి యోగా చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తల్లి నేహాదూపియాలాగా తన ఆరునెలల కొడుకు గురిక్సింగ్ బేడీ యోగాసనాలు వేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫొటోలపై కత్రినా కైఫ్తోపాటు ఇతర స్టార్ హీరోయిన్లు స్పందించారు.
నేహాదూపియా అదోముఖ శ్వాసనం వేస్తుండగా, ఆమె ఆరునెలల కొడుకు కూడా వచ్చి తల్లిలాగా ఆసనం వేశాడు. తల్లిలాగే ఆసనం వేసిన చిన్నారిని చూసి అంతా ముచ్చటపడుతున్నారు. మై మండే మోటివేషన్ అనే క్యాప్షన్తో నేహాదూపియా తన ఇన్స్టా అకౌంట్లో ఈ ఫొటోను షేర్చేశారు. కత్రినా కైఫ్ లవ్ ఎమోజీలతో తన స్పందన తెలియజేయగా, దియామిర్జా, కరిష్మాకపూర్, సబా అలీఖాన్ కామెంట్ చేశారు. కాగా, ఇన్స్టాలో ఈ ఫొటో పెట్టిన కొన్ని గంటల్లోనే 35కే లైక్స్ రావడం విశేషం.