ఈ మధ్య దర్శకులు కూడా నిర్మాణ సంస్థలు ప్రారంభించి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. సుకుమార్,కొరటాల శివ, మారుతి వంటి దర్శకులు తమ బేనర్స్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఫార్ట్యూన్ ఫోర్ అనే సొంత బేనర్ స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేయాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడు.తాజాగా దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఇందులో జాతిరత్నాలు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాని నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.
నవీన్ ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలెంటెడ్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోగా.. జాతి రత్నాలు మూవీతో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో నవీన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతడికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. అనుష్కతో ఓ సినిమా చేయనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.