ప్రకాష్రాజ్, నవీన్చంద్ర, కార్తీక్త్న్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్, ప్రకాష్రాజ్, బి.నర్సింగరావు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్దాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ క్లాప్నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘కథ మీద నమ్మకంతో నాతో ప్రయాణం చేయడానికి ముందుకొచ్చిన ప్రకాష్రాజ్, ఏ.ఎల్.విజయ్, నవీన్చంద్రకు కృతజ్ఞతలు’ అన్నారు. మనలో ప్రతి ఒక్కరు ఈ సినిమా కథతో కనెక్ట్ అవుతారని నవీన్చంద్ర తెలిపారు. ఏ.ఎల్.విజయ్ మాట్లాడుతూ ‘కథలో కొత్తదనం ఉన్న ఏ సినిమా అయినా నాకు ఇష్టమే. ఈ కథ నచ్చి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో నిర్మాణంలో భాగస్వామినయ్యాను’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి.నర్సింగరావు, రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గురుదేవ్, ఆర్ట్: హరిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ మల్లాల, నిర్మాణ సంస్థలు: థింక్బిగ్, శ్రీషిరిడిసాయి మూవీస్, ప్రకాష్రాజ్ ప్రొడక్షన్స్, శ్రీక్రియేషన్స్.