రెండేళ్ల కింద మహర్షి చేస్తున్నప్పుడు ఇది నిజంగా నేను కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుంది అంటూ చెప్పాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి ఈ కథ రాసుకొని రెండేళ్లు తన కోసం వేచి చూశాడని.. అందుకే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. బాక్సాఫీస్ దగ్గర మహర్షి 100 కోట్లకు పైగా వసూలు చేసి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు అవార్డుల పరంగా కూడా ఈ సినిమా సత్తా చూపించింది.
తాజాగా ప్రకటించిన 67 వ జాతీయ అవార్డుల్లో ఎవరూ ఊహించని విధంగా 3 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా తెలుగు భాషలో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి. అలాగే ఈ సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. మహర్షి సినిమాను PVPతో కలిసి దిల్ రాజు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. కానీ అవార్డు మాత్రం దిల్ రాజు సంస్థను వరించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరంకు బెస్ట్ డాన్స్ మాస్టర్గా జాతీయ అవార్డు వరించింది. ఏదేమైనా మహర్షి సినిమా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో దర్శక నిర్మాతలతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. సినిమాపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైంది అంటూ చెబుతున్నారు.
వ్యవసాయం, రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 లో హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి..
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?