నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’. మూర్తి దేవగుప్తపు దర్శకుడు. వానర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. హీరో నారా రోహిత్పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ వ్యవస్థలోని అక్రమాలపై పోరాడే యువకుడిగా నారా రోహిత్ పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుంది. చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్, నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు తోట, రాజేందర్ రెడ్డి, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు.