ములుగుటౌన్, మార్చి30: ఆటోలు, జీపుల్లో సీటింగ్ పామర్థ్ధ్యానికి మించి ప్రయాణం చేస్తే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం, డీటీవోతో సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోలు బస్టాండుకు 200 మీటర్ల దూరంలో నిలపాలన్నారు. కాలం చెల్లిన వాహనాలు, అధిక లోడుపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐటీడీఏ పీవో హన్మంతు కే.జండగే, ఏఎస్పీ సాయిచైతన్య, ఆర్టీసీ డీసీఎం శ్రీధేవి, డీటీవో వేణు, ఏఎంవీటీ శ్రీనివాస్, మహేశ్, ధరమ్ సింగ్ పాల్గొన్నారు.