Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నగరంలోని మోకిలలోని తన స్వగృహానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
గత నెలలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడారు. తీవ్ర గుండెపోటు కారణంగా బ్రెయిన్ డ్యామేజీ అవ్వడంతో కోమాలోకి వెళ్లిన ఆయన.. శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లరి నరేశ్ పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Taraka Ratna | బాలయ్య సినిమాలో తారకరత్న కీలకపాత్ర?