హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డిని సినీ నటుడు బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం ఇంటికి వెళ్లిన ఆయన కొద్దిసేపు మాట్లాడారు. సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఆదివారం గాంధీ భవన్కు వచ్చిన ఆయన కొద్ది సమయం మంత్రితో పలు అంశాలపై చర్చించారు. విద్యాశాఖలో పేపర్ల లీకేజీని అరికట్టేందుకు ఆయన పలు సూచనలిచ్చారు. దీంతోపాటు చేనేత రంగాన్ని బలోపేతానికి కూడా సలహాలిచ్చారు. అయితే, దీనిపై వివరంగా చర్చించేందుకు తాను అమెరికా నుంచి తిరిగి వచ్చాక మరోసారి కలుద్దామని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు తెలిసింది.