నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాల్ని సమకూర్చగా అనంత్ శ్రీరామ్ రచించిన ‘దిగు దిగు దిగు నాగా..’ అనే గీతాన్ని ఇటీవలే విడుదల చేశారు. ఆ పాటకు సోషల్మీడియాలో అద్భుత స్పందన లభిస్తోంది. యూట్యూబ్లో రెండు రోజుల్లోనే నాలుగు మిలియన్ల వీక్షణల్ని సొంతం చేసుకుంది. పెళ్లి నేపథ్యంలో సాగే సకుటుంబ కథా చిత్రమిదని దర్శకురాలు తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్చంద్రశేఖర్, మాటలు: గణేష్కుమార్, సమర్పణ: పి.వి.వి.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.