జోష్ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య (Akkineni Naga Chaitanya). అయితే ఈ సినిమా బాక్సాపీస్ వద్ద అంతగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ఏ మాయ చేశావే సినిమాతో హీరోగా కెరీర్లోనే బెస్ట్ సినిమా అందుకున్నాడు. ఇమేజ్తో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమా తీసే యువ నటుల్లో చైతూ ఒకడు. ఈ కుర్ర హీరో అరుదైన మైల్ స్టోన్ను చేరుకున్నాడు. సోషల్ మీడియాలో నాగచైతన్య ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది.
ఇన్స్టాగ్రామ్ (Instagram)లో చైతూ ఫాలోవర్ల సంఖ్య ఇపుడు 7 మిలియన్లకుపైగా ఉంది. తమ అభిమాన హీరో క్రేజీ మైల్స్టోన్కు చేరుకున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య. రాశీఖన్నా (Raashii Khanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు చైతూ తొలిసారి హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమీర్ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ ఛద్దా (Laal Singh Chaddha)లో కీ రోల్ పోషిస్తున్నాడు.
మరోవైపు దూథ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టును కూడా విక్రమ్ కే కుమారే డైరెక్ట్ చేస్తుండటం విశేషం. థ్యాంక్యూ విడుదల తేదీకి సంబంధించిన త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.