Naa Saami Ranga | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన తాజా చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. నాగార్జునకు చాలా కాలం తర్వాత మళ్లీ సరైన హిట్టు పడ్డట్టు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసుకుంది.
జనవరి 14న భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధిస్తున్నది. తొలిరోజు నుంచి భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా.. 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.44.8 కోట్ల గ్రాస్ వసూళ్లు (సుమారు రూ.21కోట్ల నెట్) రాబట్టింది. ఈ సందర్భంగా బ్రేక్ ఈవెన్ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కొరియోగ్రాఫర్గా ఫేమస్ అయిన విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఫస్ట్ మూవీతోనే మెప్పించారు.
An Absolute KING SIZE TRIUMPH❤️🔥
Sankranthi KING #NaaSaamiRanga Breakeven done in ALL AREAS & entered into profit zone💥
Book 🎟’s
https://t.co/1i8BJmy6kJ#NaaSaamiRangaJaatharaKING 👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath… pic.twitter.com/N3Bm3oW1rR
— BA Raju’s Team (@baraju_SuperHit) January 22, 2024
మరోవైపు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను పాపులర్ డిజిటల్ ప్లాట్ఫాం డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకుంది. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించాడు. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు.