విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 9న విజయ్ దేవరకొండ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని ‘నా రోజా నువ్వే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. విజయ్-సమంత మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ప్రతి ఒక్కరికి తమ ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. ‘నా రోజా నువ్వే’ పాట ప్రేమలోని మధుర భావాలకు అద్దం పట్టేలా ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.