శ్రీమంతుడు సినిమాతో ఎంట్రీతోనే తెలుగు సినీ పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్టు అందించింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movies Makers). ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ఈ టాప్ బ్యానర్ ప్రస్తుతం బాలకృష్ణతో వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప 2తోపాటు పలు సినిమాలు ఈ బ్యానర్ ఖాతాలో ఉన్నాయి.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ మరో ముందడుగు వేయబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే..మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మొదలుపెడుతుండటం. ఫిలింనగర్ సర్కిల్ తాజా కథనాల ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇక నుంచి నైజాంలో సినిమాల పంపిణీలో భాగం కానుందట.
డిస్ట్రిబ్యూషన్ కోసం నెల్లూరుకు చెందిన సక్సెస్ఫుల్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్తోపాటు కొంతమంది సభ్యుల బృందాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డిసెంబర్ తొలి లేదా రెండో వారంలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త కార్యాలయం ఏర్పాటు కానుందట. దీనిపై అధికారిక అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి మరి.
Read Also : Sunil | శివకార్తికేయన్ మావీరన్లో సునీల్.. వీడియో
Read Also : Rashmika Mandanna | ప్రతీ ఒక్కరికీ నచ్చాలని ఏమీ లేదు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్పై రష్మిక మందన్నా
Read Also : Adivi Sesh | యూట్యూబ్ నుంచి హిట్ 2 టీజర్ డిలీట్ చేశారా..? అడివి శేష్ క్లారిటీ వీడియో