ముంబై : బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు. ఆగస్ట్ 22న ఈ వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని పోలీసులు రణ్వీర్సింగ్ను ఆదేశించారు.
నోటీసులు అందించేందుకు ముంబైలోని రణ్వీర్ నివాసానికి పోలీసులు వెళ్లగా ఆ సమయంలో నటుడు ఇంట్లో లేరు. ఆగస్ట్ 22న న్యూడ్ ఫోటోషూట్పై రణ్వీర్ను ముంబై పోలీసులు ప్రశ్నించడంతో పాటు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాలీవుడ్ నటుడిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
న్యూడ్ ఫోటోషూట్ ద్వారా నటుడు మహిళల మనోభావాలను గాయపరిచాడని ఆ సంస్ధ ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి ఉదంతాలను తీవ్రంగా వ్యతిరేకించని పక్షంలో పలువురు ద్వితీయ, తృతీయ శ్రేణి నటులు అదే బాటలో నగ్న ఫోటోలతో చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారే ప్రమాదం ఉందని ఆ సంస్ధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేసింది.