‘సీతారామం’ చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘గీతగోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ డాక్యుమెంటరీ డైరెక్టర్ పాత్రలో కనిపించనుందట. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఆమెకు ఇక్కడ హీరో పరిచయం కావడం..ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య అనుబంధం ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టబోతున్నారు. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.