తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు కొన్నాళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తోపాటు మరో పదహారు మంది భామలు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే వైరముత్తుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎటూ తేలకముందే కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ సాహితీ పురస్కారాన్ని వైరముత్తుకు ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
మాలీవుడ్ నటీమణులు కూడా వైరముత్తుకు అవార్డ్ ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వ్యక్తి నుంచి అవార్డును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో మలయాళ నటి పార్వతి తిరువొతు , గీతూ మోహన్ దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా పాల్గొన్నారు. అయితే వైరముత్తుపై వచ్చిన విమర్శలపై స్పందించిన ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ .. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. కాగా, ఓఎన్వీ గురుప్ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించిన విషయం తెలిసిందే.